నిజంనిప్పులాంటిది

Sep 05 2023, 11:01

తిరుపతి లో పెరుగుతున్న భక్తుల రద్దీ

తిరుమల :సెప్టెంబర్ 05

తిరుమలలో భక్తుల రద్దీ నేడు మంగళవారం బాగా పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నేడు శ్రీవారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

ఇక సోమవారం శ్రీవారిని 76,555 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.75 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 33,488 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

నిజంనిప్పులాంటిది

Sep 05 2023, 10:10

మహిళలూ! మీలో ఎవరు అదృష్టవంతులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన లక్కీ డ్రాను నేడు టీఎస్ ఆర్టీసీ నిర్వహించనుంది. రాష్ట్రంలోని 11 రీజియన్ కేంద్రాల్లో లక్కీ డ్రాను నిర్వహించి.. ప్రతి రీజియన్‌కు ముగ్గురి చొప్పున 33 మంది విజేతలను ఎంపిక చేయనుంది.

ఈ లక్కీ డ్రాకు జిల్లా స్థాయి మహిళా అధికారులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించి.. గెలుపొందిన వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకోసం రీజియన్‌కు రూ.50 వేల చొప్పన 11 రీజియన్లకు రూ.5.50 లక్షలను కేటాయించింది.

ఒక్కో రీజియన్‌లో ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు ఇవ్వాలని సంస్థ తాజాగా నిర్ణయించింది. రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆగస్టు 30, 31 తేదిల్లో సంస్థ ప్రకటించిన లక్కీ డ్రాకు మహిళా ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌ల్లో తాము ప్రయాణించిన టికెట్ వెనకాల పేరు, మొబైల్ నంబర్‌ను రాసి వేశారు.నేడు నిర్వహించే ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన 33 మందికి హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఈ నెల 8న బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుంది. విజేతలకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించి వారిని ఘనంగా సంస్థ సత్కరించనుంది

రాఖీ పర్వదినం సందర్భంగా ఆగస్టు 30, 31 తేదిల్లో సంస్థ ప్రకటించిన లక్కీ డ్రాకు మహిళా ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌ల్లో తాము ప్రయాణించిన టికెట్ వెనకాల పేరు, మొబైల్ నంబర్‌ను రాసి వేశారు.

నేడు నిర్వహించే ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన 33 మందికి హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఈ నెల 8న బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుంది. విజేతలకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించి వారిని ఘనంగా సంస్థ సత్కరించనుంది..

నిజంనిప్పులాంటిది

Sep 05 2023, 09:47

స్కూళ్లకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ: నేడు ఉత్తర్వులు

హైదరాబాద్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా విద్యాశాఖ నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించింది.

ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ, అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి ఎవరూ బయటికి రావద్దు అంటూ జీహెచ్ఎంసీ అలర్ట్ ప్రకటించింది.

కాగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కుండపోత వానతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. వందలాది కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి భాగ్యనగరం అంధకారంలో ఉండిపోయింది...

నిజంనిప్పులాంటిది

Sep 05 2023, 09:45

ఆదిత్య ఎల్-1 కక్ష్య పెంపు రెండోసారీ విజయవంతం

ఈ తెల్లవారుజామున 3 గంటలకు కక్ష్య పెంపు విన్యాసం

10న మధ్యాహ్నం 2.30 గంటలకు మూడోసారి కక్ష్య పెంపు

ప్రస్తుతం 282 కి.మీ. x 40,225 కి.మీ. కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆదిత్య ఎల్-1

సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటలకు దాని భూకక్ష్యను మరోమారు పెంచారు.

ఆదివారం తొలిసారి ఉపగ్రహం కక్ష్యను పెంచిన శాస్త్రవేత్తలు రెండోసారి నేటి తెల్లవారుజామున విజయవంతంగా కక్ష్యపెంపు విన్యాసాన్ని చేపట్టారు. ఈ మేరకు ఇస్రో ఎక్స్ చేసింది. బెంగళూరు, పోర్ట్‌బ్లెయిర్‌లోని గ్రౌండ్ స్టేషన్లు ఆదిత్య గమనాన్ని పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. నేడు చేపట్టిన విన్యాసం ద్వారా ఆదిత్య ఉపగ్రహం 282 కి.మీ. x 40,225 కి.మీ. కక్ష్యలో పరిభ్రమించనుంది. ఈ నెల 10న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మూడో కక్ష్య పెంపు విన్యాసాన్ని చేపడతారు.

శనివారం శ్రీహరికోట నుంచి బయలుదేరిన ఆదిత్య ఎల్-1ను హాలో ఆర్బిట్ అయిన లాంగ్రాంజియన్ పాయింట్-1 (ఎల్-1) లో ప్రవేశపెడతారు. ఈ పాయింట్ భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రయోగంలో ఉపగ్రహం సూర్యుడికి సమీపంగా వెళ్లడం కానీ, సూర్యుడి మీద లాండింగ్ కానీ ఉండదని ఇస్రో స్పష్టం చేసింది. వచ్చే ఐదేళ్లపాటు ఈ ఉపగ్రహం ఆదిత్యుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పంపిస్తుంది. ఆ తర్వాత కూడా మరో 10-15 సంవత్సరాల వరకు అది పనిచేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Sep 05 2023, 09:43

ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

మంచిర్యాల జిల్లా :

హాజీపూర్‌ శ్రీరాంసాగర్‌, కడెం ప్రాజెక్ట్‌లతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ 20 గేట్లు 2 లక్షల క్యూసెక్కులనీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నీటిమట్టం 20.175 టీఎంసీలకు గాను 18.110 టీఎంసీలతో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి దాదాపు 1.67 లక్షల క్యూసెక్కులు ప్రా జెక్ట్‌లోకి చేరుతోంది.

హైదరాబాద్‌ మెట్రో వా టర్‌ వర్క్స్‌ పథకానికి 311 క్యూసెక్కులు, 20 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు...

నిజంనిప్పులాంటిది

Sep 05 2023, 09:42

గుంతకల్ రాయదుర్గం పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు నేడు పర్యటన

నేటి నుంచి మూడు రోజులు పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. బాబు ష్యురిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

నేడు ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు బళ్లారి జిల్లా జిందాల్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. బళ్లారిలో స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన రాయదుర్గం నియోజకవర్గం ఓబులాపురం చెక్‌పోస్ట్‌కు చేరుకుంటారు.

రాయదుర్గం నియోజకవర్గం పల్లె పల్లె సమీపంలో వేరుశనగ రైతులతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు రాయదుర్గం పట్టణానికి చేరుకుని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

రేపు 6న కళ్యాణదుర్గం, 7న గుంతకల్లు నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. చంద్రబాబు రాక సందర్భంగా ఘనంగా టీడీపీ శ్రేణులు స్వాగత ఏర్పాట్లు చేశారు...

నిజంనిప్పులాంటిది

Sep 05 2023, 08:04

Hyderabad | హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం..

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో (Hyderabad) పలు చోట్ల కుండపోతగా వర్షం (Heavy rain) కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది..

ఖైరతాబాద్‌, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్‌, పాతబస్తీ, ఎల్బీనగర్‌, సాగర్‌రింగ్‌రోడ్‌, హస్తినాపురం, బీఎన్‌రెడ్డి, నాగోల్‌, ఉప్పల్‌, హబ్సిగూడ, తార్నాక, ఈసీఐఎల్‌, సికింద్రాబాద్‌, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ,

ప్యారడైస్‌, బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బొల్లారం, చిలకలగూడ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, కేపీహెబీ కాలనీ, ఆల్విన్‌ కాలనీ, మియాపూర్‌, కుత్భుల్లాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, మెహదీపట్నంలో వాన దంచికొడుతున్నది..

నిజంనిప్పులాంటిది

Sep 05 2023, 08:03

తల్లిదండ్రుల తర్వాత గురువుల పాత్ర వెలకట్టలేనిది : సీఎం కేసీఆర్

ఉపాధ్యాయుల దినోత్సవం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పెంపొందించి, లక్ష్యం పట్ల వారి కి స్పష్టమైన అవగాహన కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ‘మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ’ అనే సూక్తి, తల్లిదండ్రుల తర్వాత గురువులకు ఉన్న ప్రాధాన్యం తెలియజేస్తున్నదని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఉపాధ్యాయుల, విద్యార్థుల సంక్షేమానికి, అభివృద్ధికి సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేస్తున్నదని వివరించారు. గురుకుల విద్యలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, నాణ్యమైన విద్యను అందిస్తూ రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో ముందంజలో ఉన్నదని తెలిపారు.

గుణాత్మక విద్యను అందిస్తూ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు చదువుల్లోనూ, క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటుతుండటం గర్వకారణమని అన్నారు. విద్యారంగ ప్రగతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అంకితభావానికి, చిత్తశుద్ధికి ఇది నిదర్శమని పేర్కొన్నారు...

నిజంనిప్పులాంటిది

Sep 04 2023, 18:41

Viral Wedding Reception: కోనసీమలో పెళ్లంటే మాములుగా ఉండదు.. ట్రెండ్ సెట్ చేస్తున్న కొత్త జంట..

పెళ్లంటే ఓ సందడి వాతావరణం ఉంటుంది. పెళ్లింట్లో బంధువులు, ఫ్రెండ్స్, పిల్లలు, పెద్దలతో కోలాహలంగా మారుతుంది. రెండ్రోజులు ముందుగానే సందడి సందడిగా ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతారు..

మంగళస్నానం దగ్గరి నుంచి పెళ్లి అయిపోయేంత వరకు ఓ పండగలా జరుగుతుంది. అయితే పెళ్లి రోజు మాత్రం వెరీ స్పెషల్. తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో వధువరులు ఒక్కటవుతారు. ఆ తర్వాత రిసెప్షన్ కార్యక్రమం ఉంటుంది. అందులో వధువరులిద్దరూ ఫొటోలు దిగడం, వీడియోలు తీసుకుని వారి మెమోరీస్ ను గుర్తించుకుంటారు. అయితే ఓ పెళ్లిలో రిసెప్షన్ కు వెళ్లడానికి ఊరేగింపు కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎలా అంటే..!

పెళ్లిళ్లలో కోనసీమకు ఒక ప్రత్యేకత ఉంటుంది. పెళ్లికి ముందు కానీ, పెళ్లి తర్వాత కానీ అల్లుళ్లకు గ్రాండ్ గా వంటకాలు చేసి పెట్టిన సంఘటనలు విన్నాం, చూశాం. కానీ ఇప్పుడు సుఖేష్, శ్రీ రంగనాయకి అనే కొత్త జంట ట్రెండ్ సెట్ చేస్తుంది. రాజోలులో వధూవరులిద్దరూ వెడ్డింగ్ రిసెప్షన్ కు తీసుకెళ్తుండగా భారీ ఊరేగింపును ఏర్పాటు చేశారు.

కారులో కూర్చున్న ఈ జంట చుట్టూ బౌన్సర్లు, బుల్లెట్ బైకులపై మహిళలు పైలట్ గా తీసుకెళ్తున్నారు. డప్పు, వాయిద్యాల మధ్య బాణాసంచా పేల్చూతూ ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా ముందు, వెనుకాల భారీగా జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ నూతన జంటకు సంబంధించిన ఊరేగింపు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఊరేగింపును చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు నెటిజన్లు ఊరేగింపును ఇంత గ్రాండ్ గా జరుపుకుంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా కోనసీమలో పెళ్లంటే మాములుగా ఉండదని అంటున్నారు.

నిజంనిప్పులాంటిది

Sep 04 2023, 18:40

కోస్తాంధ్రకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.

నెల రోజుల విరామం అనంతరం ఏపీలో మళ్లీ వర్షాల జోరు మొదలైంది. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గణనీయమైన స్థాయిలో వర్షపాతం నమోదైంది.

తాజాగా భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో ఈ నెల 5, 6 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ నెల 6న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. రాబోయే రెండ్రోజుల్లో 11.56 సెంమీ నుంచి 20.44 సెంమీ వరకు రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది..